తాగునీరు లేక అల్లాడిపోతున్నాం

16 Apr, 2018 07:34 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అన్నా.. కాలనీలో తాగునీరు వంటి మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్నాం. మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం లేదు. దీంతో ఆ నీరంతా రోడ్డు మీదకు చేరి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం’ అని కొత్తూరు తాడేపల్లి వేమవరం కాలనీకి చెందిన మహిళలు ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను కలిసి కాలనీలో సమస్యలను వివరించారు. రాత్రిళ్లు వీధి దీపాలు కూడా వెలగడం లేదని, బయటకు వెళ్లాలంటే విషసర్పాలతో భయపడుతున్నామని జననేతకు వినతిపత్రాన్ని సమర్పించారు.

>
మరిన్ని వార్తలు