కృష్ణా జిల్లా : ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు’ అని జి.కొండూరుకు చెందిన పి. నాగమల్లేశ్వరరావు ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తూ, నిబంధనల ప్రకారం అందించాల్సిన అలవెన్సులను కూడా కొన్ని సంస్థలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు.