మూడు నెలలుగా తాగునీరు అందడం లేదు

23 Apr, 2018 07:46 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. మూడు నెలల నుంచి తాగునీరు అందడం లేదు’ అని అమృతనగర్‌ కాలనీకి చెందిన మహిళలు ఆదివారం ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చేతిపంపులు లేకపోవడంతో దూరప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని వివరించారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, బస్టాప్‌ సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు నడిచి వెళుతున్నామని తమ సమస్యలను జననేతకు ఏకరువు పెట్టారు.

మరిన్ని వార్తలు