కృష్ణా జిల్లా : ‘అయ్యా.. మేమంతా టైలర్లం. టైలరింగ్ వృత్తిమీద ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. రెడీమేడ్ వ్యాపారం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మీరైనా టైలర్స్ సొసైటీని ఏర్పాటు చేయండి’ అంటూ మచిలీపట్నం పోర్ట్రోడ్డు ప్రాంతానికి చెందిన కృష్ణాజిల్లా టైలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎ.మాణిక్యాలరావు, కోనేరు వెంకటేశ్వరరావు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ను కలసి సమస్యలు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గారు టైలర్స్ సొసైటీ ఏర్పాటుకు జీవో 86ను విడుదల చేశారని అయితే టీడీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రులు, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యలను పట్టించుకోవడంలేదని వాపోయారు.