కృష్ణాజిల్లా : ‘అన్నా...ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం తెలుగుదేశం నాయకులు ముఖం చాటేశారు’ అని కైకలూరు మండలం కాకతీయనగర్ కాలనీకి చెందిన వోదూరి నాగమణి, బంగారు వాణి, ఎర్రంశెట్టి దుర్గతో పాటు పలువురు మహిళలు ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్మోహన్రెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయనగర్కు వచ్చిన జననేతకు మహిళలు వారు పడుతున్న అవస్థలను వివరించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, కార్పొరేషన్ రుణాల మంజూరులో కూడా తీవ్ర వివక్ష చూపుతున్నారని వాపోయారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడంతో రహదారి పక్కన పూరి గుడిసెలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నామని వాపోయారు.