మంచినీటి సమస్యతో బాధపడుతున్నాం

25 May, 2018 06:56 IST|Sakshi

పశ్చిమగోదావరి : కొల్లేరు ప్రాంతంలో ఉన్న మాకు తీవ్ర మంచినీటి సమస్య. కలుషితమైన నీటిని తాగి రోగాల బారినపడుతున్నాం అంటూ సరిపల్లి గ్రామంలో బల్లె రమణాయమ్మ అనే మహిళ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి తాము అనారోగ్యం పాలైతే సరైన వైద్యం చేయించుకునే మార్గం లేదని తెలిపారు. ఆగడాలలంకలో ఉంటున్న తమకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులు నిర్మించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు