ఉపాధి లేక అల్లాడుతున్నాం

25 May, 2018 06:59 IST|Sakshi
బల్లె నాగమణి

పశ్చిమగోదావరి : అన్నా జగనన్న మాది కొల్లేరు ప్రాంతం. భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామం. మా గ్రామంలో 15 వేలకు పైగా జనాభా. కొల్లేరు ప్రాంతం కావడంతో భూములన్నీ చెరువులుగా మార్చేస్తున్నారు. మాకు వ్యవసాయ పనులు లేక, ఇబ్బంది పడుతున్నాం. మీరే మాకు న్యాయం చేయాలన్నా అంటూ సరిపల్లి సమీపంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆగడాలలంకకు చెందిన బల్లె నాగమణితో పాటు మరికొందరు మహిళలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సమస్య పరిష్కరిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు