పశ్చిమగోదావరి : నిండు గర్భవతిగా ఉన్న నాకు భీమవరం ఆసుపత్రి సిబ్బంది నా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా సిజేరియన్ చేశారు. దీంతో నాకు కలిగిన మగబిడ్డ మృతి చెందాడన్నా అంటూ ఆరేడుకు చెందిన దవులూరి మేరీ గ్రేస్ అనే మహిళ జగన్మోహన్రెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో తమకు సంబంధించిన రిపోర్టులు కూడా దాచివేశారని, అన్నా మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.