పశ్చిమగోదావరి :నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు పుట్టిన వారికి మాతృత్వ వందన యోజన పథకంలో రూ.6 వేలు ఇస్తామని అంగన్వాడీ కార్యకర్తలు నా రేషన్కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లు పట్టుకుని వెళ్లారు. అయితే సొమ్ములు మాత్రం ఇవ్వలేదు. చాలాసార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. మీరు వచ్చిన తరువాత మాలాంటి తల్లులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆదుకోవాలని గుదే నాగ సుధారాణి జగన్మోహన్రెడ్డిని చిన కాపవరం వద్ద కలిసి విజ్ఞప్తి చేశారు.