పశ్చిమగోదావరి : తాము చేసే పనికి, వచ్చే జీతానికి పొంతన లేకుండా ఉందని ఆశా వర్కర్లు డి.దయామణి, సరోజిని, కొల్లి దయమ్మ వాపోయారు. కుటుంబ పోషణ కష్టతరంగా ఉందని పాలంగిలో జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకు రూ.7 వేలు జీతం ఇస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.