తూర్పుగోదావరి : నార్కెడిమిల్లికి చెందిన వైదా అనంతలక్ష్మి తన ఇంటిలో పాడి గేదె ఈనిన తర్వాత తొలి ముర్రు పాలతో చేసిన జున్నును పాదయాత్రలో ఉన్న జగనన్నకు అందజేసి పరమానందం పొందింది. పచ్చళ్ల తయారీ ద్వారా జీవించే కుటుంబంలోని ఆ చెల్లెమ్మ జగనన్నకు స్వాగతం పలికేందుకు వచ్చి తాను తెచ్చిన జున్ను ఆయనకు రుచి చూపించానని ఆనందం వ్యక్తం చేసింది.