ఆశలన్నీ నీమీదే.. నువ్వు రావాలన్నా..!

16 Jun, 2018 07:31 IST|Sakshi

తూర్పుగోదావరి : అందరిదీ ఒకటే ఆశ.. అన్ని సమస్యలకీ అన్నొస్తేనే పరిష్కారం.. అన్న రానే వచ్చాడు.. ఆర్తితో కూడిన గొంతులన్నీగోడు వెళ్లబోసుకున్నాయి. మొరలాలకించిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘రానున్నది మన ప్రభుత్వమే.. సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.. మీ సంక్షేమానికి నాది హామీ’ అంటూ అనునయించి వెన్ను తట్టారు. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర శుక్రవారం ఆత్రేయపురం నుంచి రావులపాలెం వరకు సాగింది.  

లొల్ల లాకులను పునరుద్ధరించాలి– ముదునూరి వెంకటరామరాజు, ఆత్రేయపురం
బ్రిటీషు కాలంనాటి లొల్ల లాకులు శిథిలావస్థకు చేరాయి. వీటిని పునరుద్ధరించాలని ఆత్రేయపురానికి చెందిన రైతు ముదునూరి వెంకటరామరాజు జగన్‌మోహన్‌రెడ్డిని కోరాడు. ఇవి పడిపోతే కింద పొలాలకు నీరు అందదని మీరు సీఎం అయిన తరువాత లొల్ల లాకుల పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఙప్తి చేశాడు.

జగన్‌ వస్తే మంచిరోజులు వచ్చినట్టే – మెరిపే వెంకటలక్ష్మి, మర్లపాడు
తూర్పుగోదావరి : మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు, అన్ని వర్గాల వారికీ నవ రత్నాల పథకాల ద్వారా న్యాయం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని చెప్పింది మర్లపాడుకు చెందిన మెరిపే వెంకటలక్ష్మి తెలిపింది. ఆయన అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయి. సమష్టిగా ఆయన్ను గెలిపించుకుంటామని తెలిపింది.

మరిన్ని వార్తలు