తూర్పుగోదావరి :జగన్ మా ఊరు గంటి పెదపూడి వస్తున్నారని తెలిసి చూద్దామని వెళ్లాను. ఎక్కడ చూసినా జనం. ముసలిదాన్ని కదా... వెళ్లలేననుకున్నాను. రోడ్డు మీదే పక్కన నిలబడిపోయాను. జగన్బాబు అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నారని విన్నాను. ఓపిక తెచ్చుకుని లైన్లో నిల్చున్నాను. సరిగ్గా ఆయన దగ్గరకు వెళ్లేసరికి ఎవరో తోసేయడంతో నా కాలి చెప్పు ఊడిపోయింది. అయ్యయ్యో! అనుకునేలోపు జగన్ బాబే వంగి చెప్పు తీసి నా కాలికి తొడిగారు. గొప్పవారు అలా చేయడమేంటనిపించింది. అవ్వా జాగ్రత్త అంటూ నవ్వుతూ పలకరించారు. మహానుభావుడనిపించింది. నాకు ఎవరూ లేరు. మనవడి దగ్గర ఉంటున్నాను. అంటూ గంటి పెదపూడికి చెందిన పి.మరియమ్మ జగన్తో తన అనుభూతిని ఇలా వెల్లడించింది.