హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు

19 Jun, 2018 06:19 IST|Sakshi

తూర్పుగోదావరి :సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ అనేకసార్లు ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు అంటూ సీపీఎస్‌ ఉద్యోగులు జననేత జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా యర్రంపాలెం వచ్చిన  వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథక ఉద్యోగుల సంఘం పి.గన్నవరం మండల కమిటీ సభ్యులు కలిసి తమ సమస్యను వివరించారు. తమ సమస్యను అర్ధం చేసుకుని సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానంటూ వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని సీపీఎస్‌ ఉద్యోగులు   అన్నారు.

మరిన్ని వార్తలు