దాకే సౌమ్యశ్రీ, పుచ్చల్లంక
ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు హామీలు గుప్పించాడు. కానీ బాబు వచ్చాడు.. జాబురాలేదు. ఇంటికో ఉద్యోగమిస్తామని నిరుద్యోగులను మోసం చేశాడు. నేను పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని పుచ్చలంకకు చెందిన దాకే సౌమ్యశ్రీ వివరించింది.