హామీలు అమలు పరచలేదన్నా

2 Jul, 2018 06:21 IST|Sakshi

తూర్పుగోదావరి : కుమారుడు చనిపోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు అధికారులు  ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నా అంటూ ముమ్మిడివరం మండలం కందికుప్పకు చెందిన ఉండ్రు బాలవేణి జగన్‌ వద్ద వాపోయింది. తన కుమారుడు అనిల్‌కుమార్‌ భీమనపల్లి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ 2013లో అనుమానస్పదంగా మృతి చెందాడని, ఆ సమయంలో అధికారులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రెండెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి, నేటికీ నెరవేర్చలేదని తెలిపింది. ప్రస్తుతం తాను ముమ్మిడివరం ఎస్సీ బాలికల వసతి గృహంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కమాటీగా పనిచేస్తున్నానని, తన ఉద్యోగాన్ని పర్మనెంట్‌ చేయడంతో పాటు రెండెకరాల భూమిని ఇచ్చేలా చూడాలని కోరింది.

మరిన్ని వార్తలు