విజయనగరం : అంత్యోదయ కార్డులు మంజూరు చేసి మాలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం తమకు నెలవారీ తక్కువ బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో పూట గడవటమే కష్టంగా ఉంది. జగన్ బాబు అధికారంలోకి వచ్చాక మాబోటి వారిని ఆదుకోవాలి.– రాయిపిల్లి అమ్మడమ్మ, వృద్ధురాలు,కొయ్యానపేట, మక్కువ
నా మనవడ్ని ఆదుకో నాయన...
నా మనవడు గణేష్కు చిన్నతనం నుంచే కంటి సమస్య ఉంది. కళ్లజోళ్లు పెట్టుకుంటే కాని చదవలేని పరిస్థితి ఉంది. నువ్వే ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవడం లేదు. నీవు అధికారంలోకి వచ్చిన వెంటనే మాలాంటి దీనుల సమస్యలు పరిష్కరించాలి. – కసిరిబోను సన్యాసమ్మ, తూరుమామిడి