బతుకు బస్టాండు

22 May, 2018 09:11 IST|Sakshi
కదిరి బస్టాండులో బస్సులు లేక ప్రయాణికుల నిరీక్షణ

సీఎం సభకు తరలిన బస్సులు

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

కదిరి అర్బన్‌: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనతో ఆర్టీసీ ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కదిరి ఆర్టీసీ డిపోలో దాదాపు 104  బస్సులు ఉంటే అందులో 60 బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో పలు సర్వీసుల రద్దయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు  ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు ఆశ్రయించారు. మరికొందరు మాత్రం బస్టాండుల్లోనే గంటల తరబడి వేచి చూశారు. ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా తమకీ పాట్లు తప్పడం లేదని ప్రయాణికులు వాపోయారు. 

మరిన్ని వార్తలు