జలపాతంలో వ్యక్తి గల్లంతు

2 Apr, 2015 18:26 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కొవ్వూరు సమీపంలోని గాలిగుమ్మి జలపాతంలో ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జయభేరి మారుతీ కంపెనీలో పని చేస్తున్న నవీన్(28) తోటి ఉద్యోగులతో కలసి జలపాతం దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చారు.

అయితే ప్రమాదవ శాత్తు నవీన్ కాలుజారి నీటి ప్రవాహంలో పడ్డాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ నవీన్ ఆచూకీ లభించలేదు.
 

మరిన్ని వార్తలు