ఆత్మకూరు (నెల్లూరు జిల్లా): అనారోగ్యంతో బాధపడుతూ ఏఎస్పేట దర్గా వద్ద సేవ చేసుకుంటున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన మహ్మద్ హుస్సేన్(45) గత ఏడాది క్రితం భార్యతో కలసి ఏఎస్పేట దర్గా వద్దకు చేరుకున్నాడు.
హుస్సేన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి స్థానికులు కొందరు ఊరి శివార్లలో బహిర్భూమికి వెళ్లగా నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వరండా మెట్ల వద్ద చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన అతనిని గమనించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందచేయడంతో ఎస్సై తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అతనని గమనించన పోలీసులు అతను అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.