25 నుంచి పీజీ ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్

10 Sep, 2015 09:25 IST|Sakshi

బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ పీజీ ఈసెట్-2015 రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ జీవీఆర్ ప్రసాద్‌రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎంటెక్, ఎం.ఫార్మసీ విభాగాల్లో 25,304 సీట్లుండగా మొదటిదశ కౌన్సెలింగ్‌లో 17,790 మంది ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 14,035 మందికి సీట్లు కేటాయించినట్లు చెప్పారు. సీట్లు పొందినవారు ఈ నెల 14లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేసి అడ్మిషన్ తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు