తెనాలి: విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకిని ఎక్స్ప్రెస్కు సోమవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడు వద్ద రైలు పట్టా విరిగిందని, గ్యాంగ్మన్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. వెంటనే రైలును అక్కడే నిలిపివేసిన అధికారులు, సిబ్బందితో రైల్వే ట్రాక్ను పునరుద్దరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.