‘రైతులందరికీ..ఇకపై అన్నీ మంచి రోజులే’

7 Aug, 2019 14:29 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రకృతి కూడా సహకరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి బుధవారం కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఎనిమిదేళ్లుగా నిండని సాగర్‌కు ఇప్పుడు నీళ్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తోందని.. రైతులందరికీ ఇకపై అన్నీ మంచిరోజులేనని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు