లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్

7 Nov, 2015 19:00 IST|Sakshi

ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వన్‌ టౌన్‌లోని ఓ లాడ్జిలో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి, మూడు సెల్‌ఫోన్లను, రూ.3,03,200 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును వన్‌ టౌన్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు