పోలవరం లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలి: సీఎం

12 Dec, 2017 16:06 IST|Sakshi

అమరావతి: పోలవరం లెక్కలన్నీ ఆన్ లైన్‌లో పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు లెక్కలపై
ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన ఈ ప్రాజెక్టుకు గతంలో పెట్టిన ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుల వివరాలను పొందుపర్చాలన్నారు. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. ఖర్చుల వివరాలతోపాటు పోలవరానికి సంబంధించిన ఇతర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఎం సూచించారు.

మరిన్ని వార్తలు