అమరావతి: యాదవుల చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి వద్ద యాదవ ప్రతినిధులను అరెస్టు చేశారు. రూ.2 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, యాదవ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, అమరావతిలో యాదవ సంక్షేమ భవన్కు పదెకరాలు కేటాయించాలని యాదవ సమితి అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.