-

బ్లాక్ మెయిల్ కేసులో పోలీసులు అరెస్ట్

18 Jan, 2015 18:17 IST|Sakshi

చిత్తూరు: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులే దాన్ని తుంగలో తొక్కుతున్నారు. మదనపల్లిలో ఓ బ్లాక్ మెయిల్ కేసులో రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన ఘటనలో ఒక కానిస్టేబుల్, హోంగార్డు వెంకటరమణతో పాటు శివకుమార్ అనే మరో వ్యక్తి అరెస్టయ్యారు. ఈ ఘటనలో వారి వద్ద నుంచి రెండు కార్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని మదనపల్లి టూటౌన్ పోలీసులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు