గుంటూరు: మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమమే కాకుండా ఆమె భర్తను పోలీసులు చితకబాదిన దారుణ ఘటన గుంటూరు రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. ఓ మహిళ పట్ల కానిస్టేబుల్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు.
అడ్డుకున్న ఆమె భర్తపై మరో పది మంది పోలీసులు దాడి చేశారు. దీనిపై బాధితులు చేసినా స్థానిక సీఐ శరత్బాబు కేసు నమోదు చేయలేదు. బాధితుల మీదే ఎదురు కేసు పెడతానంటూ బెదిరించాడు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే జులాయిల్లా ప్రవర్తిస్తే ఎవరితో చెప్పుకోవాలని బాధితులు వాపోయారు.