టీడీపీ నేత ఇంట్లో అక్రమ మద్యం పట్టివేత

23 May, 2020 10:15 IST|Sakshi

సాక్షి, కృష్ణా: టీడీపీ నాయుకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని కాటూరులో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో అక్రమ మద్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆ నేత ఇంట్లో నుంచి 105 మద్యం బాటిళ్లను స్వాధినం చేసుకున్నట్లు రూరల్‌ పోలీసులు వెల్లడించారు. ఇక అక్రమ మద్యం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఉయ్యూరులో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. పోలీసు స్టేషన్‌ ఎదుట టీడీపీ నేతలు బోడె ప్రసాద్‌, వైవిబి రాజేంద్రప్రసాద్‌ ధర్నాకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ.. మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు