‘జేసీ.. క్షమాపణ చెప్పాల్సిందే’

19 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు.. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. వేదికపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను వారించకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసింది. బూట్లు తుడిచేందుకు తాము టీడీపీ బానిసలం కాదని, బుల్లెట్లు ప్రయోగించటంలో శిక్షణ పొందిన ప్రజాసేవకులం అని పేర్కొంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. జేసీ దివాకర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసుల సంఘం డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు