కాకినాడ: తొండంగి మండలంలో పోలీసులు మళ్లీ 144 సెక్షన్ విధించారు. దివీస్ ఫ్యార్మాస్యూటికల్స్ కంపెనీకి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. గ్రామస్ధులు కంపెనీ స్ధాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాగా, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దివీస్ ఫ్యాక్టరీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీపీఎం నేతలతో పాటు మరో 200 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.