రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు!

6 Jun, 2020 20:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పట్టణంలోని భవానీపురం లేబర్ కాలనీలో ఆరేళ్ల బాలుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను కలవరానికి గురిచేసింది. అయితే, భవానీపురం పోలీసుల చొరవతో బాలుడు క్షేమంగా బయటడపటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలుడి విషయం తెలియగానే.. భవానీపురం ఎస్సై కవిత శ్రీ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు, కానిస్టేబుల్‌ చలపతి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోడలో ప్రమాదవశాత్తు ఇరుకు పోయిన బాలుడిని చాకచక్యంగా కాపాడారు. భవానీపురం పోలీసులు వేగంగా స్పందించడంతో బాలుడికి ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు.


మరిన్ని వార్తలు