సబ్బవరంలో రూ. కోటి నగదు పట్టివేత

20 Mar, 2019 11:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియా అడిగిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగదు పంపిణీకి ఏపీ గ్రామీణ బ్యాంక్‌ను టీడీపీ నేతలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు