పోలియో చుక్కలు వేసిన క్రికెటర్ లక్ష్మణ్

19 Jan, 2015 01:58 IST|Sakshi
పోలియో చుక్కలు వేసిన క్రికెటర్ లక్ష్మణ్

అమరావతి : ప్రముఖ అమరారామ కేంద్రమైన అమరావతిలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కలమందు వేశారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ బాలబాలికలు భవిష్యత్‌లో వికలాంగులు కాకుండా పోలియోను నిర్మూలించటానికి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించడం భాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అంతేకాక, పోలియో వ్యాధిని దేశంలోని ప్రజలందరూ కలసి కట్టుగా పారదోలాలన్నారు. డాక్టర్ శ్రీధర్‌చంద్, డాక్టర్ ప్రసాదనాయక్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు