శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

9 Jun, 2018 10:11 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ హెచ్‌.ఎల్‌. దత్తు, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
 

మరిన్ని వార్తలు