బ్రోకర్లా వ్యవహరిస్తున్న పొన్నాల : సిఎం సమక్షంలో వాగ్వివాదం

9 Jan, 2014 15:14 IST|Sakshi
బ్రోకర్లా వ్యవహరిస్తున్న పొన్నాల : సిఎం సమక్షంలో వాగ్వివాదం

హైదరాబాద్ :ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  సమక్షంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ జిల్లా పాలకుర్తి టిడిపి ఎర్రబెల్లి దయాకర రావు వాగ్వివాదానికి దిగారు. వారికి సర్ధిచెప్పడానికి ముఖ్యమంత్రి శ్రమపడవలసి వచ్చింది.

గేమింగ్‌ సెజ్‌ బాధితులకు న్యాయం చేయాలని  ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోకుండా పొన్నాల బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాంతో మంత్రి పొన్నాల ఎర్రబెల్లితో వాదనకు దిగారు. ముఖ్యమంత్రి వారిద్దరికి సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

>
మరిన్ని వార్తలు