జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి

9 Dec, 2018 08:08 IST|Sakshi

సందడి చేసిన సినీ నటులు  

సొట్ట బుగ్గల సుందరి పూజా హెగ్డే శనివారం గుంటూరులో సందడి చేసింది. కొంటె చూపులతో కుర్రకారును ఉర్రూతలూగిస్తూ హలో హాయ్‌ అంటూ చిలక పలుకులు పలికింది. లక్ష్మీపురంలో స్వాతి షాపింగ్‌ మాల్‌ ప్రారంభానికి వచ్చిన ఈ సొగసరి.. చిరుదరహాసంతో యువతను  ఆకట్టుకుంది.     

గుంటూరు ఈస్ట్‌: లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డులో స్వాతి షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి శనివారం వివిచ్చేసిన సినీతారలు సందడి చేశారు. హీరోయిన్‌ పూజా హెగ్డే జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడారు. అత్యాధునిక ఫ్యాషన్‌ దుస్తులు గుంటూరు నగర ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని చెప్పారు. అందులోనూ డిస్కౌంట్‌ ధరలకే అందిస్తున్నారని తెలిపారు. ఆమెతోపాటు బిగ్‌ బాస్‌ ఫేమ్‌లు కౌశల్, దీప్తి అభిమానులకు అలరించారు. అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు రిబ్బన్‌ కట్‌ చేసి షోరూమ్‌ ప్రారంభించారు. షాపింగ్‌ మాల్‌ అధినేత వీవీ రమణబాబు లక్కీ డ్రాలో విజేతను ఎంపిక చేశారు. విజేతకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  తమ అభిమాన తారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

మరిన్ని వార్తలు