నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం

5 Mar, 2016 00:23 IST|Sakshi

కైకలూరు(కృష్ణా): అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు వ్యాన్‌లో తరలిస్తున్న 8 క్వింటాళ్ల క్యాట్‌ఫిషను గుర్తించి, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వీటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన క్యాట్‌ఫిషను గుంత తీసి పూడ్చి పెడతామన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చేపల్లో ఒక రకమైన క్యాట్ ఫిష్ వాడకాన్ని, పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

మరిన్ని వార్తలు