ఎర్రచందనం దుంగల స్వాధీనం

2 Jan, 2016 10:22 IST|Sakshi

సిమెంట్ తయారీ కేంద్రంలో లారీలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు లారీ సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ మిశ్రమం తయారు చేసే కేంద్రంలో ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. లారీలోని పొట్టు బస్తాల మధ్య దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలు పోలీసులు కనుగొన్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటి విలువ అంచనా వేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు