జర్నలిజంలో పీజీ డిప్లొమాకు

9 Apr, 2015 01:43 IST|Sakshi
  • సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నోటిఫికేషన్
  •  సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుకు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులై, 2015 ఆగస్టు 1 నాటికి 30ఏళ్లకు మించని వయసున్నవాళ్లంతా ఇందుకు అర్హులే. రూ.200 ఫీజు ఆన్‌లైన్లో చెల్లించి, దరఖాస్తును కూడా ఆన్‌లైన్లోనే నింపాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ ఏప్రిల్ 10. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ప్రచురణ కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అర్హతలు, శిక్షణ, శిక్షణ భృతి, నియమావళి, మోడల్ పేపర్లు ఇతరత్రా సమాచారం... సాక్షి ఎడ్యుకేషన్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం వెబ్‌సైట్లలో ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్: 040 23386945.
     

మరిన్ని వార్తలు