గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఆందోళన

16 Mar, 2015 13:17 IST|Sakshi

విజయనగరం : విజయనగరం జిల్లాలో గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మండల కేంద్రంలో సోమవారం ఉద్యోగులు పోస్టల్ సూపరిండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పోస్టల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉద్యోగులు దర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయానికి తాళం వేసి బైఠాయించారు. గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు పీఆర్‌సీ అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
(పార్వతీపురం)

మరిన్ని వార్తలు