కోనసీమలో కన్నుల విందుగా ప్రభల తీర్థం

16 Jan, 2020 14:04 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కోనసీమలో ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ పండగను పురస్కరించుకుని అంబాజీపేట మండలం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో గురువారం ఏకాదశరుద్రులు కొలువుదీరనున్నారు. ఈ మేరకు పదకొండు గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు ఊరేగింపుగా బయలు దేరాయి. ఏకాదశ రుద్రులను చూసేందుకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. కాగా ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కనుమ నాడు జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం కోసం చర్చిస్తారని ప్రతీతి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

చదవండి: 
ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం

జగ్గన్నతోట ప్రభల తీర్థంపై స్పెషల్‌ స్టోరీ

మరిన్ని వార్తలు