ప్రజాసంకల్పయాత్ర విజయవంతం

14 Nov, 2017 07:49 IST|Sakshi

ప్రొద్దుటూరు టౌన్‌ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విజయవంతమైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇంతటి జనాదరణ ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ తర్వాత జగన్‌కే సాధ్యమైందన్నారు. యాత్రకు పకడ్బందీ బందోబస్తు కల్పించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్‌ దేవీప్రసాదరెడ్డి, సోములవారిపల్లె నాయకుడు శేఖర్, ఎంపీటీసీ సభ్యులు బోస్, ఓబుళరెడ్డి, నాయకులు పోసా భాస్కర్, స్నూకర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. పత్రికలు వక్రీకరించాయి: ప్రజా సంకల్ప యాత్రలో  రాచమల్లు అలక.. అంటూ కొన్ని చానళ్లు,  పత్రికలు, వక్రీకరించి ప్రచారం, ప్రచురితం చేశాయని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తాను జగన్‌కు నమ్మిన బంటునని పేర్కొన్నారు. చివరి వరకు ఆయనతోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు