163వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

15 May, 2018 22:16 IST|Sakshi

సాక్షి, దెందులూరు :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 163వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం ఉదయం వైఎస్‌ జగన్‌ దెందులూరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జోగన్న పాలెం శివారు, అప్పారావ్‌ పాలెం శివారు, శ్రీరామవరం,  భైగాని పేట, మెడినరావు పాలెం మీదుగా రామారవు గూడెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి  చల్లా చింతలపూడి, పెరుగు గూడెం చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

 

మరిన్ని వార్తలు