164వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

16 May, 2018 20:20 IST|Sakshi

సాక్షి, ద్వారకా తిరుమల :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 164వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌  గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావుపేట మీదుగా గొల్లగూడెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి తిరుమలపాలెం, పాములూరు గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు