325వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

18 Dec, 2018 21:56 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు బుధవారం ఉదయం కొబ్బరిచెట్లపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 324వ రోజు  ప్రజాసంకల్పయాత్ర  మంగళవారం కొబ్బరిచెట్లపేట వద్ద ముగిసింది. వైఎస్‌ జగన్‌ ఈ రోజు ఉదయం లింగాల వలస నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. అఅక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్‌, కొప్పాలపేట క్రాస్‌, దుప్పాలపాడు క్రాస్‌, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్‌ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు ప్రజాసంకల్పయాత్ర  కొనసాగింది. 

>
మరిన్ని వార్తలు