‘నగరపాలక’ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ

23 Apr, 2020 12:09 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మున్సిపల్‌ ఆర్డీ హలీమ్‌ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ చెన్నుడుకు, ఆతర్వాత స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రవీంద్రకు కేటాయించారు. బుధవారం రెగ్యులర్‌ కమిషనర్‌ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.  

మరిన్ని వార్తలు