7 ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు

1 Oct, 2014 13:12 IST|Sakshi

హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా నేటి నుంచి ఏడు ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు ....ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లలోని 50 శాతం టికెట్లు ప్రీమియం తాత్కాల్కు బదిలీ చేసింది. దీంతో   బెర్త్లు తగ్గే కొద్దీ చార్జీలు పెరగనున్నాయి.

ఫలక్నుమా, పాట్నా, ఏపీ, బెంగళూరు, గోదావరి, దర్శన్, శబరి ఎక్స్ప్రెస్ల్లో ఈ ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు లభ్యం కానున్నాయి.  డైనమిక్ ఫెయిర్ స్ట్రక్చర్ కింద టిక్కెట్లను విక్రయించనున్నారు. దాంతో డిమాండ్ను బట్టి టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించనుంది. ఇక ఈ-టిక్కెటింగ్లో నేటి వరకూ మాత్రమే ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
 

మరిన్ని వార్తలు