జాయింట్‌వీల్‌పై నుంచి పడి అర్చకుడు మృతి

19 Feb, 2015 23:17 IST|Sakshi

కర్నూలు(మహానంది): జాయింట్ వీల్ నుంచి కిందపడి ఒక అర్చకుడు మృతిచెందాడు. వివరాలు...మహానంది పుణ్యక్షేత్రంలో జాయింట్‌వీల్‌పై నుంచి పడటంతో శివకుమార్ శర్మ (32) అనే అర్చకుడికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అర్చకుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. శర్మ సొంతూరు ఆళ్లగడ్డ మండలం పెద్దకంబళూరు. ప్రస్తుతం మహానందిలో నివసిస్తున్నాడు.

మరిన్ని వార్తలు