ప్రధాని, సీఎంపై కేసు నమోదు చేయాలి

22 Sep, 2015 04:59 IST|Sakshi
ప్రధాని, సీఎంపై కేసు నమోదు చేయాలి

కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చి, ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్రమోదీ ఆ విషయం మరిచారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా తెప్పించడంలో విఫలమయ్యారని పీసీసీ అధికార ప్రతినిధులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, నీలి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీకి వారు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా కల్పించని ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశామని పేర్కొన్నారు.

ఇప్పటికీ వారిపై కేసు నమోదు చేయకుండా అలాగే పక్కన పెట్టారని, వెంటనే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు జకరయ్య, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు